అలియా భట్కు చెందిన పర్సనల్ అసిస్టెంట్ వేదికా ప్రకాశ్ శెట్టిని చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. ఆమె సొమ్ము 77 లక్షలు కాజేసినట్లు తేలింది. 2021 నుంచి 2024 వరకు అలియాభట్కు పర్సనల్ అసిస్టెంట్గా వేదికా శెట్టి పనిచేసింది. ఆ కేసులో వేదికా ప్రకాశ్ శెట్టిని అరెస్టు చేశారు. అలియాకు చెందిన ప్రొడక్షన్ ఆఫీస్ కంపెనీతో పాటు పర్సనల్ అకౌంట్ల నుండి ఆ మొత్తాన్ని కాజేసినట్లు తెలుస్తోంది. మే 2022 నుండి ఆగస్టు 2024 మధ్యలో ఈ నేరం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అలియా తల్లి, ఆర్ట్ డైరెక్టర్ సోని రజ్దాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయం బయటపడింది. జనవరి 23వ తేదీన జూహూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. చీటింగ్ కేసు నమోదు అయిన తర్వాత వేదికా శెట్టిని అరెస్టు చేశారు. ఆ సమయంలో హీరోయిన్ అలియాకు చెందిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్లు, షెడ్యూల్ ప్లానింగ్ చూసుకునేది. నకిలీ బిల్లులు సృష్టించి అలియాభట్ సంతకం తీసుకుని డబ్బును లూటీ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. ట్రావెల్, మీటింగ్లు, ఇతర నిర్వహణ కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తున్నట్లు ఆమె చెప్పేదని పోలీసులు వెల్లడించారు. అలియా సంతకం చేసిన తర్వాత ఆ అమౌంట్ తన స్నేహితురాలికి ట్రాన్స్ఫర్ అయ్యేదని, ఆ తర్వాత మళ్లీ వేదికా శెట్టి అకౌంట్లోకి ఆ డబ్బు వెళ్లేదని పోలీసులు తేల్చారు. అలియా తల్లి ఫిర్యాదు చేసిన తర్వాత.. వేదికా శెట్టి పరారీలో ఉంది. రాజస్థాన్, కర్ణాటక, పుణె, బెంగుళూరులలో తిరిగింది. అయితే బెంగుళూరులో ఆమెను జూహూ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్పై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
- July 9, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor

