మెసేజ్‌తో మొదలైన ప్రేమ.. పెళ్లి బంధం వేసింది..

మెసేజ్‌తో మొదలైన ప్రేమ.. పెళ్లి బంధం వేసింది..

టాలీవుడ్‌లో ప్రేమ పెళ్లితో ఒక్కటైన అక్కినేని నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ ప్రేమ కథ ఎప్ప‌టికీ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. దాదాపు రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత ఎక్కువగా పబ్లిక్‌గా కనిపించని నాగ చైతన్య, తాజాగా తన భార్య గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. అత్యంత పాపులర్ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో హోస్ట్ జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు చైతూ ఓపికగా, సరదాగా స్పందించాడు. “నేను నా భార్యను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో కలుస్తానని అస్సలు అనుకోలేదు. ఆమె వర్క్ గురించి నాకు బాగా తెలుసు. ఓసారి నేను నా క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టినప్పుడు, ఆమె ఓ ఎమోజీతో కామెంట్ చేసింది. అప్పుడే చాట్ స్టార్ట్ అయ్యింది. తర్వాత కలుసుకున్నాం” అంటూ నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు చైతన్య. తన భార్య గురించి చెబుతూ, “శోభితా మై వైఫ్… ఆమె నా బిగ్గెస్ట్ స్ట్రెంథ్ అండ్ సపోర్ట్. ఆమె లేకుండా ఉండలేను” అంటూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

editor

Related Articles