వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్ ఈసారి తప్పకుండా హిట్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం కెరీర్లో కీలక దశలో ఉన్న ఆయన, కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా రితికా నాయక్ నటించనుందని సమాచారం. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’తో మంచి గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు వరుస అవకాశాలతో ముందుకు సాగుతోంది. నితిన్ సినిమాలో ఛాన్స్ దక్కడం ఆమె కెరీర్కు మరో ప్లస్గా భావిస్తున్నారు.
ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ డ్రామాగా రానుందని తెలుస్తోంది. నితిన్ స్టైల్కు సరిపోయేలా కథను సిద్ధం చేసినట్లు టాక్. కొత్త టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ జంట కెమిస్ట్రీపై ఆసక్తి నెలకొంది.

