శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, స్పిరిట్ మీడియా బ్యానర్ల మీద సొనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ దివ్యాశీస్సులతో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది ఉప శీర్షిక. ఈ మూవీలో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించారు. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య మేరుగు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ నవంబర్ 21న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో లవ్ ట్రోట్టర్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ సామ్రాట్ నాగ చైతన్య, సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
నాగ చైతన్య మాట్లాడుతూ .. ‘నారాయణ్ దాస్ కె నారంగ్ గారు, సునీల్ నారంగ్ గార్ల వారసత్వాన్ని జాన్వీ ముందుకు తీసుకు వెళ్తున్నారు. వీరి బ్యానర్లో ‘లవ్ స్టోరీ’ లాంటి మంచి సినిమాను చేయడం, వారి ద్వారానే శేఖర్ కమ్ముల పరిచయం అవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను.

