అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “ఈ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది కాలానికి అతీతమైన ప్రేమ కథ. మా సినిమా ట్రైలర్ పై కొందరు కావాలనే విషం చిమ్ముతున్నారు.

