మాధురీ దీక్షిత్ ఆ లైవ్ షో వివాదం..?

మాధురీ దీక్షిత్ ఆ లైవ్ షో వివాదం..?

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కెనడాలో నిర్వహించిన తన లైవ్ ఈవెంట్‌కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా రావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షో ప్రారంభ సమయం టికెట్లలో రాత్రి 7:30గా పేర్కొన్నప్పటికీ, మాధురీ దీక్షిత్ రాత్రి పది గంటల తర్వాత వేదికపైకి రావడంతో అభిమానులు ఈవెంట్ నిర్వహణలోపాలను బయటపెట్టారు.ఒక నెటిజన్ ఈ షో గురించి రాసుకొస్తూ, “ఇది చాలా చెత్త ప్రోగ్రాం. ప్రకటనల్లో చెప్పినట్లుగా కాకుండా మాధురీ ఆలస్యంగా రాకపోవడం మాత్రమే కాకుండా, కేవలం కొద్దిసేపు మాట్లాడి ప్రతీ పాటకి ఒకట్రెండు సార్లు మాత్రమే డ్యాన్స్ చేశారు. ఇది చాలా నిరాశ కలిగించింది” అని తెలిపారు.మాధురీ దీక్షిత్ కెనడా లైవ్ షో వివాదంమరో నెటిజన్ తన నిరసనను వ్యక్తం చేస్తూ, “మాధురీ రాక ఆలస్యం కావడంతో నాకు ఉన్న పనివల్ల షో మొదలు కాకముందే వెళ్లిపోవాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.

ఈ షోపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొంతమంది అభిమానులు తాము కొనుగోలు చేసిన టికెట్ల డబ్బులు తిరిగి ఇవ్వాలని నినాదాలు చేసినట్లు సమాచారం.

editor

Related Articles