గ్రీస్‌లో ప్రభాస్ షూటింగ్..

గ్రీస్‌లో ప్రభాస్ షూటింగ్..

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ది రాజాసాబ్‌’. మారుతి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ వెలువడింది. ఇటీవలే పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం యూరప్‌ పయనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రీస్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్‌పై తెరకెక్కిస్తున్న సోలో గీతమిది.
ఇది పూర్తయిన తర్వాత ప్రభాస్‌ – నిధి అగర్వాల్‌పై ఓ రొమాంటిక్‌ పాటను తీయబోతున్నారు. ఈ రెండు పాటలతో షూటింగ్‌ మొత్తం పూర్తయినట్లేనని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో హర్రర్‌ అంశాలతో పాటు ప్రభాస్‌ పండించిన కామెడీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌, సంజయ్‌దత్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: కార్తీక్‌ పళని, సంగీతం: తమన్‌.

editor

Related Articles