టాలీవుడ్ హీరో మంచు మనోజ్ “మిరాయ్” సినిమాతో విలన్ గా మారి మంచిపేరు, సినిమాకు హిట్ టాక్ తీసుకొచ్చాడు. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, రూ.100 కోట్ల మార్క్ కు చేరువైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయవాడలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్, దర్శకుడు బాబీ కొల్లి, రచయిత బీవీఎస్ ప్రసాద్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఈరోజు నేను ఈ వేదిక మీద ఉన్నానంటే, దానికి కారణం మా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. చిన్నవాడైనా ఆయన టాలెంట్ కి నా వందనం. సినిమా రిలీజ్ అయ్యాక నా మనసుకి హత్తుకున్న విషయం ఏంటంటే.. మా అమ్మ నిర్మలాదేవి సినిమా చూసిన తర్వాత నన్ను కౌగిలించుకొని ఏడ్చారు. ‘నువ్వు మహావీరుడిలా అదిరిపోయావ్’ అని చెప్పారు. ఎన్నో ఏళ్ల తర్వాత మా అమ్మ కళ్లల్లో ఆనందం చూశాను. ఆ రోజంతా ఫోన్లు చేస్తూ మా బిడ్డ హిట్టు కొట్టాడంటూ చెప్పిన ఆమెను చూస్తే దేవుడికి థ్యాంక్స్” అని చెప్పారు. ఇక ఈ ఇండస్ట్రీలో ఎవడైనా పెద్ద హీరో అవ్వొచ్చు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా మౌళి ‘లిటిల్ హార్ట్స్’తో హిట్ కొట్టాడు. యాక్టర్ అవ్వాలంటే చిరంజీవి కొడుకో, మోహన్ బాబు కొడుకో కావాల్సిన పనిలేదు. టాలెంట్ ఉంటే చాలు. మౌళి రేపు ఏ సినిమా చేసినా, నన్ను అడిగితే, నేను అతని సినిమాలో తప్పకుండా విలన్ క్యారెక్టర్ గా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కానీ చేస్తాను అని హామీ ఇచ్చారు.

- September 17, 2025
0
39
Less than a minute
You can share this post!
editor