బెట్టింగ్‌ యాప్ ల కేసుపై మంచు లక్ష్మీ ఏమన్నారంటే..

బెట్టింగ్‌ యాప్ ల కేసుపై మంచు లక్ష్మీ ఏమన్నారంటే..

మంచు లక్ష్మీ ప్రసన్న ఇటీవల నిషేధిత బెట్టింగ్‌ యాప్ లను ప్రమోట్‌ చేసిన వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు ఆగస్టులో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆగస్ట్ 13న మంచు లక్ష్మిని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నటీనటులు ప్రకాష్ రాజ్‌, విజయ్‌ దేవరకొండ, రానాలను ఈడీ ప్రశ్నించింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి స్పందించారు. దర్యాప్తులో ఏం జరిగిందో దాన్ని పక్కనపెట్టి మీడియా మరోదాన్ని హైలెట్‌ చేసిందని ఆమె మండిపడ్డారు. అసలు ఈ యాప్ లు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి. వీటి ఉనికి ఏంటి అనే సమస్యను అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదని ఆమె ప్రశ్నించారు.
‘ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించాలని వారు భావించడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఇది ఎక్కడ మొదలైందనే దానిపై వారు దృష్టిపెట్టాలి. ఈ విచారణ అంశంపై మీడియాలో నాపై వచ్చిన వార్తలు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే మేం విచారణ ఒక విషయంలో ఎదుర్కొంటే.. అది తెలుసుకొని మీడియా మరోదాన్ని హైలెట్‌ చేసింది. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో డబ్బు ఎలా సమకూరుతోంది.. ఎక్కడికి వెళ్తోంది.. అన్నదానిపై  దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులకు నిధులు వెళ్తున్నాయా.. అనే దానిపై కూడా దృష్టిపెట్టారు. నాకు ఇవేవీ తెలియదు. 100 మంది ఈ బెట్టింగ్‌ యాప్స్ ను ప్రమోట్‌ చేశారని వారు చెప్పారు. ఆ లిస్ట్ లో నేనూ ఉన్నానని చెప్పారు. అందుకే నేను విచారణకు వెళ్లాను. ఇదంతా ఒక్క నిమిషం పని’ అని మంచు లక్ష్మి అన్నారు.

editor

Related Articles