థియేటర్లలో ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్!

థియేటర్లలో ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్!

2004లో వచ్చిన బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘లక్ష్మీ నరసింహా’. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ నిర్మించిన ఈ సినిమా ఆ ఏడాది ఘన విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను 4కె వెర్షన్‌లోకి మార్చి.. ఈ నెల 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత బెల్లంకొండ సురేష్  తెలిపారు. ఈ రీ-రిలీజ్‌ వెర్షన్‌లో ఓ కొత్త పాట కూడా యాడ్‌ అయ్యిందని, ‘మందేసినోడు..’ అంటూ సాగే ఈ పాటని చంద్రబోస్‌ రాయగా, భీమ్స్‌ సిసిరోలియో అన్‌స్టాపబుల్‌ వైబ్‌తో కంపోజ్‌ చేశారనీ, స్వరాగ్‌ కీర్తన్‌ ఆలపించిన ఈ పాట ఈ న్యూవెర్షన్‌కే హైలెట్‌ కానున్నదని బెల్లంకొండ సురేష్‌  చెప్పారు.

editor

Related Articles