ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్నా మొదటి వరుసలో ఉంటారు. ప్రస్తుతం రూపొందుతోన్న ప్రెస్టేజియస్ సినిమాల్లో ఎక్కువ శాతం హీరోయిన్ రష్మికే. బాలీవుడ్లో సైతం ఈ హీరోయిన్ ఓ రేంజ్లో వెలిగిపోతోంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువగానే ఉంటుంది రష్మిక. రీసెంట్గా సోషల్ మీడియాలో వర్షాలపై ఆసక్తికరంగా ఓ పోస్ట్ పెట్టింది తను. ‘వర్షాకాలం వచ్చేసింది. నిజానికి నాకు వర్షాకాలం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వర్షాల వల్ల పనులు మందగిస్తాయి. వర్క్ స్పీడ్గా జరగదు. అయితే.. వర్షం వచ్చే ముందు వచ్చే మట్టి వాసన అంటే మాత్రం నాకెంతో ఇష్టం. ఆ స్మెల్ వస్తే.. గుండెల నిండా పీల్చేసుకుంటా.’ అంటూ పోస్ట్ పెట్టింది రష్మిక.

- May 26, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor