ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని తాను కౌగిలించుకున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ ఫొటోలపై బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు ఫొటోలను ప్రసారం చేయడం ఆశ్చర్యకరమని ఆమె మండిపడ్డారు. మే 17న పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ప్రీతి జింటా, వైభవ్ సూర్యవంశీ కలుసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు వీడియోలో ప్రీతి జింటా వైభవ్తో కరచాలనం చేసి, కాసేపు మాట్లాడారు. అయితే, కొందరు ఆకతాయిలు ఈ వీడియోను మార్ఫింగ్ చేసి, ప్రీతి జింటా వైభవ్ను కౌగిలించుకున్నట్లు తప్పుడు ఫొటోలను సృష్టించి విస్తృతంగా ప్రచారం చేశారు. తాజాగా ఈ మార్ఫింగ్ ఫొటోలపై ప్రీతి జింటా తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది. “ఇది మార్ఫింగ్ చేయబడిన ఫొటో, తప్పుడు వార్త. ఇప్పుడు వార్తా ఛానెళ్లు కూడా మార్ఫింగ్ ఫొటోలను ఉపయోగించి వార్తలుగా ప్రసారం చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది! అని ఆమె పోస్ట్ చేశారు.
- May 20, 2025
0
144
Less than a minute
Tags:
You can share this post!
editor

