బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తాజాగా ఓ లగ్జరీ ఇల్లును కొనుగోలు చేశాడు. అరబ్ దేశమైన ఖతార్లో తన కోసం కొత్త బంగ్లాను కొనుగోలు చేశాడు. దేశ రాజధాని అయిన దోహాలోని ది సెయింట్ రెజిస్ మార్సా అరేబియా ఐలాండ్లోని ది పెరల్లో ఒక విలాసవంతమైన లగ్జరీ ఇల్లును కొనుగోలు చేశారు. ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ కొనుగోలు జరిగింది. ఈ లగ్జరీ అపార్ట్మెంట్ గురించి ఇటీవల సైఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఖతార్ చాలా సురక్షితమైన ప్రదేశమని, అక్కడ ఉండటం చాలా మంచి అనుభూతినిస్తుందని సైఫ్ తెలిపాడు. “ఒక హాలిడే హోమ్ లేదా సెకండ్ హోమ్ గురించి ఆలోచించినప్పుడు, నేను కొన్ని విషయాల గురించి ఆలోచిస్తాను. అందులో ఒకటి మనం ఉండే ఇల్లు దగ్గరగా ఉండాలి, అలాగే సులువుగా ఇంటికి చేరుకునేలా ఉండాలని తెలిపాడు. తన కొత్త ఇల్లు “ఆఫీసుకు దూరంగా ఉన్న ఇల్లు” అని అభివర్ణించిన సైఫ్, పని నిమిత్తం అక్కడికి వెళ్లినప్పుడు ఆ స్థలానికి మరింత కనెక్ట్ అయ్యానని చెప్పాడు. ఆస్తి గోప్యత, విలాసం కలయిక అతనికి బాగా నచ్చిందని ఆయన పేర్కొన్నాడు. తన భార్య కరీనాకపూర్ ఖాన్, వారి కుమారులు తైమూర్, జెహంగీర్లను కూడా త్వరలో ఖతార్కి తీసుకురావాలని ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
- April 22, 2025
0
71
Less than a minute
Tags:
You can share this post!
editor

