‘కేసరి 2’ ఇంట్రో మిస్ కాకండి.. ఫ్యాన్స్‌కు అక్ష‌య్ రిక్వెస్ట్

‘కేసరి 2’ ఇంట్రో మిస్ కాకండి.. ఫ్యాన్స్‌కు అక్ష‌య్ రిక్వెస్ట్

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా సినిమా ‘కేస‌రి చాప్టర్ 2’. అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ జలియన్‌ వాలాబాగ్‌ అనేది ట్యాగ్‌లైన్‌. మాధ‌వ‌న్, రెజీనా క‌సాండ్రా, అన‌న్య పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌ర‌ణ్ సింగ్ త్యాగీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించి అభిమానుల‌కు ఒక రిక్వెస్ట్ చేశాడు అక్ష‌య్ కుమార్. ఈ సినిమా చూసేవారు ఇంట్రో మిస్ అవ్వ‌కండంటూ తెలిపాడు. ఈ సినిమా చూడటానికి వచ్చే వారందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే.. ద‌య‌చేసి ‘కేసరి 2’ ఇంట్రో మిస్ కాకండి. ఈ సినిమాలోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి. మీ కెమెరా ద్వారా ఇది ప్రతి ఒక్కరికీ చేరుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా చూడాలని నిర్ణయించుకున్నవారు బిగినింగ్ నుండి చూసి తెలుసుకోవాలి. సరైన సమయంలో రావాలి. ఈ సినిమా క‌థ ఆ 10 నిమిషాలు నుండే ప్రారంభమవుతుందంటూ అక్ష‌య్ చెప్పుకొచ్చాడు.

editor

Related Articles