రెండు రోజుల బాలీవుడ్ హంగామా OTT ఇండియా ఫెస్ట్, ఇండియా ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్కు చాలామంది తారలు హాజరయ్యారు. అక్టోబర్ 3న ఫస్ట్ డేన తారలు ప్యానల్ డిస్కషన్స్లో నిమగ్నమై తమ ఇటీవలి సినిమాల గురించి కూడా చర్చించుకున్నారు. రెండో రోజు ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
రకుల్ ప్రీత్ సింగ్ తాను హీరోయిన్గా నటించిన నటీనటుల చిత్రాల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. వారిలో అజయ్ దేవగణ్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి చర్చించారు.