శివ‌నామ స్మ‌ర‌ణ‌తో మోత మోగిపోతున్న టాలీవుడ్..

శివ‌నామ స్మ‌ర‌ణ‌తో మోత మోగిపోతున్న టాలీవుడ్..

టాలీవుడ్ స్థాయి పెరిగింది. వైవిధ్య‌మైన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్‌ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ కూడా కొత్త ద‌నాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే దేవుళ్ల‌పై టాలీవుడ్‌లో చాలా సినిమాలు రూపొందాయి. ముఖ్యంగా శివుడికి సంబంధించిన సినిమాలు ఎన్నో తెర‌కెక్క‌డ‌మే కాకుండా మంచి విజ‌యాలు సాధించాయి. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా శివ‌య్య‌పై సినిమాలు చేస్తున్నారు. ఇటీవ‌లే త‌మ‌న్నా న‌టించిన ఓదెల‌2 శివ‌య్య ప్ర‌ధానంగా రూపొందిన సినిమా. అలానే `శివం భ‌జే శివుడు కీల‌కంగా రూపొందింది. ఈ రెండు ఈ మ‌ధ్య కాలంలో రిలీజ్ అయి మంచి ఫ‌లితాలు సాధించాయి. తాజాగా పాన్ ఇండియాలో శివ నామ‌స్మ‌ర‌ణ మోగించేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు. మంచు విష్ణు ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న క‌న్న‌ప్ప ప్రాజెక్ట్ మంచు ఫ్యామిలీకే డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా, ఇది శివుని భ‌క్తుడు క‌న్న‌ప్ప క‌థ ఆధారంగా తెర‌కెక్కింది. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. అందుకు కార‌ణం ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, మధు ప్రీతి ముకుందన్ లాంటి స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషించ‌డ‌మే. జూన్‌లో ఈ సినిమా విడుద‌ల‌కి సిద్ధం కాగా, దీనిపై అంద‌రిలో భారీ అంచ‌నాలే ఉన్నాయి. సీజీ ప‌నులు ఆల‌స్య‌మ‌వుతోన్న నేప‌థ్యంలో సినిమా రిలీజ్ కాస్త వాయిదా వేసి జూన్ 27న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

editor

Related Articles