టాలీవుడ్ దర్శకుడు హరీష్శంకర్ తెలుగు ప్రేక్షకులపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మనోళ్లు (తెలుగు ప్రేక్షకులు) మన సినిమాలు చూడరు కానీ బయట సినిమాలు (ఇతర భాష సినిమాలు) బానే చూస్తారు. కాబట్టి ఈ సినిమాని కూడా చూడాలంటూ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు హరీష్శంకర్. మలయాళంలో బాక్సాఫీస్ హిట్గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ సినిమా తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. ‘జింఖానా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు హరీష్శంకర్ సినిమా హిట్టు అవ్వాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
- April 23, 2025
0
78
Less than a minute
Tags:
You can share this post!
editor

