టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్, హీరో ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. మరోవైపు మే నెలలో తారక్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. మేకర్స్ తారక్తో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకు చాలా ముఖ్యమైనవని సమాచారం. శ్రుతిహాసన్ గతంలో ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్య అనే సినిమాలో నటించింది ఆ విషయం మీకు తెలుసు. ఇదిలావుంటే ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర బృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని, ఆమె కూడా అంగీకరించారని టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో శ్రుతిహాసన్ డ్యాన్స్ సాంగ్ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఆమె కథకు కీలకమైన పాత్రలో కనిపించవచ్చని తెలుస్తోంది. తారక్ పాత్ర, ఆమె పాత్రల మధ్య ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయని సమాచారం.
											- April 26, 2025
 
				
										 0
															 72  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				
