బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా సినిమా ‘కేసరి చాప్టర్ 2’. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనేది ట్యాగ్లైన్. మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించాడు. సమ్మర్ కానుకగా ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు హిట్టు టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమా 5 రోజుల్లో రూ.39.16 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించింది. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థనే అధికారికంగా ప్రకటించింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా 5 రోజుల్లో రూ.100 కోట్లు సాధించాల్సింది పోయి.. కేవలం రూ.40 కోట్లు కూడా దాటకపోవడంతో రూ.100 కోట్ల మార్క్ ఎప్పటికి దాటుతుందో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు యాక్షన్ సీన్స్ లేకపోవడంతో ఓటీటీలోకి వచ్చాక అప్పుడే చూద్దాంలే అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
- April 23, 2025
0
68
Less than a minute
Tags:
You can share this post!
editor

