అనంతశ్రీరామ్‌కు బెస్ట్‌ లిరిక్‌ రైటర్‌గా ఐఫా అవార్డు..

అనంతశ్రీరామ్‌కు బెస్ట్‌ లిరిక్‌ రైటర్‌గా ఐఫా అవార్డు..

పాటల రచయిత అనంతశ్రీరామ్‌ బెస్ట్‌ లిరిక్‌ రైటర్‌గా ఐఫా అవార్డును దక్కించుకున్నారు. ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ముఖ్య తారలుగా సాయిరాజేష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘బేబీ’ (2023) సినిమా కోసం అనంతశ్రీరామ్‌ రాసిన ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా అనంతశ్రీరామ్‌ని అభినందిస్తూ ‘బేబీ’ టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రేక్షకుల రివార్డులతోపాటు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ‘బేబీ’ని వరిస్తున్నాయంటే.. ఈ ఘనత ఈ ప్రేమ కథను హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడు సాయిరాజేష్‌కే దక్కుతుందని నిర్మాత కొనియాడారు. సాయిరాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా హిందీలోనూ రీమేక్‌ అవుతున్న విషయం  మీకు తెలుసా.

administrator

Related Articles