నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. తారక్ ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగా.. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్ను మైత్రీ సినిమా మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది (2026) సమ్మర్ కానుకగా.. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను షేర్ చేసింది. మరోవైపు ఈ సినిమా సెట్స్లో ఎన్టీఆర్ ఇప్పటికే అడుగుపెట్టాడు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.
- April 29, 2025
0
61
Less than a minute
Tags:
You can share this post!
editor

